Posts

చిత్తూరు జిల్లాలో ఓ కంటైనర్ బీభత్సం స్పష్టించింది

చిత్తూరు జిల్లాలో ఓ కంటైనర్ బీభత్సం స్పష్టించింది. అతివేగంతో ఓమ్ని వ్యాన్, ద్విచక్రవాహనం, ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ అతివేగంతో వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్​, క్లీనర్​తో సహా 10 మంది చనిపోయారు. శనివారం ఉదయం మరో వ్యక్తి మృతదేహం లభ్యమవగా... అది కంటైనర్ డ్రైవర్ అక్షయ్ భౌతిక కాయంగా గుర్తించారు. అక్షయ్​తో కలిపి మృతుల సంఖ్య 11కు చేరింది. ఇప్పటికీ విషమంగానే మరి కొందరు బ్రేకులు విఫలమై ఆటో, ఓమ్ని వ్యాన్, ద్విచక్రవాహనంపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఒకే కుటుంబంలో 8 మంది మృతి ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. గంగవరం మండలం మర్రిమాకులపల్లె గ్రామానికి చెందిన వీరంతా చిత్తూరు తెల్లగుండ్లపల్లెలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామచంద్ర (50), రామ...

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ..

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.  24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,640, విజయవాడలో రూ.39,020, విశాఖపట్నంలో రూ.39,100, ప్రొద్దుటూరులో రూ.38,950, చెన్నైలో రూ.37,960గా ఉంది.  ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,820, విజయవాడలో రూ.36,150, విశాఖపట్నంలో రూ.35,970, ప్రొద్దుటూరులో రూ.36,150, చెన్నైలో రూ.36,330గా ఉంది.  వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,300, విజయవాడలో రూ.46,000, విశాఖపట్నంలో రూ.45,300, ప్రొద్దుటూరులో రూ.45,800, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Image
చండీగఢ్‌ :  పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోథిలో బెర్‌ సాహిబ్‌ గురుద్వారలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం సందర్భంగా ప్రధాని గురుద్వారను సందర్శించారు.  గురుదాస్‌పూర్‌లో డేరాబాబా నానక్‌ వద్ద కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీకి పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. పాకిస్తాన్‌లోని నరోవల్‌ జిల్లా కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను భారత్‌లోని డేరాబాబా నానక్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి, 500 మందితో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’కు జెండా ఊపుతారు.

టిక్‌టాకే లోకమైన అక్కాచెల్లెళ్ల వరుసయ్యే ఆ ఇద్దరు యువతులు అక్కడే తమతో పరిచయమైన ఇద్దరు యువకులతో ప్రేమలో పడ్డారు!

టిక్‌టాకే లోకమైన అక్కాచెల్లెళ్ల వరుసయ్యే ఆ ఇద్దరు యువతులు అక్కడే తమతో పరిచయమైన ఇద్దరు యువకులతో ప్రేమలో పడ్డారు! ‘వచ్చేయండి పెళ్లిచేసుకుందాం’ అని ఆ యువకులు చెప్పడంతో సంబరపడ్డారు. తల్లిదండ్రులు వారించినా, వినకుండా మరీ రైలెక్కారు. తీరా అక్కడికి వెళ్లాక వారు మొహం చాటేయంతో ఇద్దరూ కంగుతిన్నారు! సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన యువతుల కథ ఇది! ఇద్దరూ అన్నాదమ్ముల కూతుళ్లు. తుప్రాన్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్నారు. ఏపీ అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వంశీ, వన్నూరుస్వామి డిగ్రీ విద్యార్థులు. ఇద్దరు యువతులకు టిక్‌టాక్‌లో ఆర్నెల్ల క్రితం ఈ యువకులు పరిచయమయ్యారు. అది ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుందాం.. వచ్చేయండి అంటూ ఆ యువతులకు వంశీ, స్వామి చెప్పారు. తమ ఊరు దాకా ఎలా రావాలో పక్కాగా రూట్‌మ్యాప్‌ కూడా ఇచ్చారు. వెంటనే ఆ యువతులు రైలెక్కి దర్గాహోన్నూరుకు చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారిని తాము వివాహం చేసుకోలేమని వంశీ, స్వామి వారికి తేల్చిచెప్పారు. దిక్కుతోచనిస్థితిలో ఆ యువతులు అక్కడి గ్రామ పెద్దలను ఆశ్రయించి న్యాయం చేయాలన...

దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

Image
అయోధ్య:  రామజన్మ భూమి వివాదంపై సుప్రీం కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.  యూపీలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఈరోజు నుంచి 11వ తేదీవరకూ సెలవులు ప్రకటించారు.  అలాగే అలీఘడ్, కాన్పూర్, ముజఫ్ఫర్‌నగర్‌లో 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రక్షణ దళానికి చెందిన జవానులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

టాప్ 10 న్యూస్

1. అయోధ్య తీర్పు నేడే యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10.30కు ఈ తీర్పును వెలువరించనుంది.  2. వదంతులు వ్యాప్తి చేస్తే బేడీలే.  అయోధ్య వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్‌’ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌ వెల్లడించారు. ఎవరైనా వాటిని మరొకరికి కాని, మరో గ్రూప్‌నకు కాని పంపిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  3. నేడే కర్తార్‌పుర్‌ నడవా ప్రారంభం సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘కర్తార్‌పుర్‌ నడవా’ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి గురుదాస్‌పుర్‌లోని డేరాబాబా నానక్‌ వద్ద ఏకీకృత చెక్‌పోస్ట్‌ (ఐసీపీ)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  4. నేడు సకల జనుల సామూహిక ...

యువకులను ముగ్గులోకి దింపి. బ్లాక్‌మెయిలింగ్‌కేసులు పెట్టి వేధింపులు

యువకులను ముగ్గులోకి దింపి. బ్లాక్‌మెయిలింగ్‌ కేసులు పెట్టి వేధింపులు3 కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా 27 కేసులు యువతిని అరెస్టు చేసిన ఆబిడ్స్‌ పోలీసులు. హైదరాబాద్:- ఆబిడ్స్‌, ‘మొదట మాయ మాటలతో యువకులను ముగ్గులోకి దించుతుంది. ఆ తర్వాత బాగా సన్నిహితమవుతుంది. కొన్నాళ్లకు.. నాపై అత్యాచారానికి యత్నించావు.. బెదిరింపులకు పాల్పడ్డావంటూ వారిపై అక్రమంగా కేసులు పెడుతూ.. బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది..’ అంటూ ఓ యువతి ఆగడాలను ఆబిడ్స్‌ సీఐ రవికుమార్‌, ఎస్సై బి.రాజు శుక్రవారం ఇక్కడ వివరించారు. ఆబిడ్స్‌ చిరాగ్‌అలీలేన్‌లో ఓ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ రహీం(30) గత నెల 19న అపస్మారక స్థితిలో ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. సమాచారం అందుకుని దవాఖానకు వెళ్లి అతని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి విచారణ చేపట్టగా విస్తుగొలిపే అంశాలు పోలీసుల దృష్టికొచ్చాయి. అంబర్‌పేట ఫర్హత్‌నగర్‌కు చెందిన షాదాన్‌ సుల్తానా నిజామియా(27) ఆగడాల చిట్టా చూసి కంగుతిన్నారు ఎలా బయటకొచ్చిందంటే. 2018లో సుల్తానా. పనిమీద అబ్దుల్‌ రహీం కార్యాలయానికి వెళ్లింది. అతని చరవాణి నంబరు తీసుకొని తరచూ ఫోను చేసేది. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌లో రూ.4 ల...