ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య: తుని ఎమ్మెల్యే సహా ఐదుగురిపై ఫిర్యాదు.. కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలం ఎస్. అన్నవరంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అయితే ఈ దారుణానికి పాల్పడిందెవరన్న విషయం ఇంతవరకూ తెలియరాలేదు. తాజాగా.. హత్య విషయంలో సత్యనారాయణ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుని వైసిపి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా మరో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. విలేకరి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. ఈ కేసును సీరియస్గా తీసుకుని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డీజీపీని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.