పీఎంసీ బ్యాంక్​ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ భారీగా ఆస్తులు సీజ్​

పీఎంసీ బ్యాంక్​ కుంభకోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ భారీగా ఆస్తులు సీజ్​ చేసిన నేపథ్యంలో ప్రధాన నిందితులైన హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు ​రాకేశ్​ వాద్వాన్, సారంగ్ వాద్వాన్‌.. తమ ఆస్తులను అమ్మాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆర్​బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఈడీలకు లేఖ రాశారు. రోల్స్​ రాయిస్​ కార్లు, విమానం, ఓడ ఇతర ఆస్తులను అమ్మి బ్యాంకు​ బకాయిలు చెల్లించాల్సిందిగా కోరారు.

పంజాబ్,​ మహారాష్ట్ర కో-ఆపరేటివ్​ బ్యాంక్​ కుంభకోణంలో ముంబయి ఆర్థిక కార్యకలాపాల పోలీస్​ వింగ్ ​వాద్వాన్లను అరెస్టు చేసింది. బుధవారం రోజు నిందితులను కోర్టు.. జ్యుడీషియల్​ కస్టడీకి అప్పగించిన నేపథ్యంలో ఈడీ జత చేసిన తమ 18 రకాల ఆస్తులను అమ్మటానికి అనుమతినిచ్చారు.

అమ్మకపు ఆస్తుల వివరాలు...

ఆస్తులు అమ్మకానికి అనుమతించిన జాబితాలో రాకేశ్​​కు చెందిన అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెంటల్, బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ, అంబాసిడర్ ​వంటి కార్లు ఉన్నాయి. వీటితో పాటు సారంగ్​కు చెందిన ఫాల్​కన్​ 2000 విమానం, ఆడీ ఏజీ కారు, మరో రెండు విద్యుత్ కార్లు, మూడు క్వాడ్​ బైకులు, స్పీడ్​ బోట్లను విక్రయించడానికి అంగీకరించారు.

'ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో పైన పేర్కొన్న ఆస్తులను అమ్మవలసిందిగా అభ్యర్థిస్తున్నాం' అని లేఖలో రాశారు.

ఇదీ కేసు..

పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్​ డెవలప్​మెంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..