అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది

న్యూఢిల్లీ

రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. 

మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు. 

నేటితో వాదనలు పూర్తవనున్నాయని వ్యాఖ్యానించారు.

తొలుత విచారణ అక్టోబర్​ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. 

ఇటీవల అక్టోబర్​ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. 

తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. 

హిందూ, ముస్లిం వర్గాలు.. ఎదుటి పక్షాల వాదనలపై తమ తమ తుది అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటలవరకు సమయం ఇచ్చే అవకాశముంది.

అయితే... అయోధ్య కేసు విచారణలో తుది తీర్పు నవంబర్​ 4-5 తేదీల్లో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

విచారణ ముగుస్తుండటం- ఏ సమయంలోనైనా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఈ నేపథ్యంలో డిసెంబర్​ 10 వరకు అయోధ్యలో 144 సెక్షన్​ విధించారు.

మధ్యవర్తిత్వం విఫలమైన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆగస్టు 6 నుంచి అయోధ్య కేసుపై రోజువారీ విచారణ చేపడుతోంది. 

వారం రోజుల దసరా సెలవుల విరామం తర్వాత... అక్టోబర్​ 14న ముస్లిం వర్గాల వాదనలు పూర్తయ్యాయి.

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్​ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..