ఉపాధి హామీ పథకం ఈ పాలకుల చేతకానితనం కారణంగా నిర్వీర్యమై పోయింది
అమరావతి
ఉపాధి హామీ పథకం ఈ పాలకుల చేతకానితనం కారణంగా నిర్వీర్యమై పోయింది
ఈ ఏడాది ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన రూ.1845 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులను ఏం చేశారు?
రాష్ట్రవాటా రూ.615కోట్లను జతచేసి ఎందుకు విడుదల చెయ్యట్లేదు? పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించడంలేదు?
వేలాది ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగిస్తున్నారు?
పేదలు బతకాలా వద్దా? ఇప్పటికైనా పేదల గోడు వినండి. గ్రామాల అభివృద్ధిని పట్టించుకోండి.
ఉపాధి హామీకి తక్షణమే నిధులు విడుదల చేసి కోట్లాది కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
కేంద్రం ప్రకటించిన జల్శక్తి అభియాన్లో నీటి సంరక్షణలో 82.16 పాయింట్లతో కడప జిల్లా అగ్రస్థానంలో నిలిచి, మొదటి ర్యాంకును అందుకోవడం సంతోషకరం.
అలాగే ఇటీవల కేంద్ర జల్శక్తిశాఖ ప్రకటించిన 23 జాతీయ జల్మిషన్ అవార్డుల్లో జలవనరుల ఉత్తమ నిర్వహణకుగానూ 5 అవార్డులను సాధించింది ఆంధ్రప్రదేశ్.
తెదేపా గత ఐదేళ్ళలో చేపట్టిన నీరు-చెట్టు, నీరు-ప్రగతి, జలసంరక్షణ ఉద్యమాల సత్ఫాలితాల వల్లే ఏపీకీ విజయాలు
రూ.60వేల కోట్లతో 22 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసాం.
8 లక్షల పంటకుంటలు తవ్వించాం. 6 వేల చెక్ డ్యామ్ లు నిర్మించి, జలవనరుల సంరక్షణకు చేసిన కృషి సత్ఫలితాలు ఇవ్వడం సంతోషకరం
ట్విట్టర్ లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
Comments
Post a Comment