ఢిల్లీలో మసాజ్ పార్లర్లలో వ్యభిచారం దందా సాగుతోంది

న్యూఢిల్లీ :

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మసాజ్ పార్లర్లలో వ్యభిచారం దందా సాగుతోంది. మసాజ్ పార్లర్ పేరిట పెట్టి అమ్మాయిలతో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్న ముఠా బాగోతాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ బట్టబయలు చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని ఓ బృందం ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని మసాజ్ పార్లర్ పై ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మసాజ్ పార్లర్‌లో కండోమ్‌లతో పాటు అమ్మాయిల పేరిట రేట్ కార్డులు లభించాయి. యువతుల అశ్లీల ఫోటోలతోపాటు వారి రేటు ఎంత అనేది పేర్కొంటూ రేట్ కార్డులు మసాజ్ పార్లర్‌లో లభించడం సంచలనం రేపింది. ఈ మసాజ్ పార్లర్ నుంచి గతంలోనూ నలుగురు అమ్మాయిలను మహిళా కమిషన్ కాపాడింది. పశ్చిమ ఢిల్లీలోని ద్వారక, ఇతర ప్రాంతాల్లోని మసాజ్ పార్లర్లు, స్పాలపై మహిళా కమిషన్ బృందం ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వ్యభిచారం రాకెట్ బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..