* అరగంట ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి * రేపటి నుంచి సచివాలయం ఉద్యోగాలకు పరీక్షలు * తొలిరోజు 12.54 లక్షల మంది హాజరు * 1.26 లక్షల పోస్టులకు 21.68 లక్షల మంది పోటీ * మొత్తం 5,134 పరీక్షా కేంద్రాలు * సుదూర ప్రాంతాల అభ్యర్థులకు ఉచితంగా భోజనం, తాత్కాలిక వసతి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, పట్టణాల్లో వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకూ రాత పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలకు 21,69,814 మంది హాజరు కానున్నారు. మొత్తం 36,449 కార్యదర్శుల పోస్టులకు 12,54,071 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సెప్టెంబరు ఒకటో తేదీన వీరికి రాత పరీక్ష ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి, వార్డు ప్రణాళిక కార్యదర్శి, విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి పోస్టులకు ఎక్కువమంది పోటీ పడటం, సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం తొలిరోజు 12.54 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానునుండడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం, తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,134