అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
విశాఖపట్నం:
అమెరికాలో చదువుతున్న విశాఖ నగరానికి చెందిన ఓ విద్యార్థి అక్కడి నదిలో ఈతకు వెళ్లి మృతి చెందారు.
సీతమ్మధార ఎన్ఆర్ఐ ఆసుపత్రి సమీప ప్రాంతానికి చెందిన ఎం.ఎస్.కుమార్ విశాఖపట్నం స్టీల్ప్లాంట్ క్రీడలశాఖ డీజీఎంగా పని చేస్తున్నారు.
ఆయన కుమారుడు ఎం.సుమీద్ (27) అమెరికాలోని పోర్టులాండ్లో ఎం.ఎస్. రోబోటిక్స్ చదువుతున్నారు.
ఆదివారం సాయంత్రం 4.30కు క్రీటర్లాక్ నదికి మరో ఇద్దరు భారతీయ స్నేహితులతో కలసి ఈతకి వెళ్లారు. నది లోతుగా ఉండటంతో మునిగి చనిపోయారు.
Comments
Post a Comment