ముగ్గురు చిన్నారులపై అత్యాచారం.

హైదరాబాద్:-

మహేశ్వరం, యాలాల, ఎడపల్లి, వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చిన్నారులు అత్యాచారానికి గురయ్యారు. నాన్నమ్మ ఊరు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ బాలిక (17)ను మాటల్లోకి దింపి ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రం సమీపంలో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ మండలం గాగిళ్లాపూర్‌లో తల్లితో కలిసి ఉంటున్న బాలిక సోమవారం రాత్రి కందుకూరు మండలం ధన్నారం వెళ్లేందుకు మహేశ్వరానికి ఆమె చేరుకుంది. బస్సుకోసం ఎదురు చూస్తుండగా ఇద్దరు యువకులు ఆమెను మాటల్లోకి దింపారు. తామూ ధన్నారానికే వెళ్తున్నామని నమ్మించి ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నారు. మహేశ్వరం దాటగానే పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం వారు గాలిస్తున్నారు. వికారబాద్‌ జిల్లా యాలాల మండలంలోని విశ్వనాథ్‌పూర్‌లో మతిస్థిమితం లేని బాలిక (7) అత్యాచారానికి గురైంది. గ్రామానికే చెందిన నక్కల శేఖర్‌ (19) మంగళవారం ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. బాలికను పక్కనే ఓ పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన ఆమె కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలో ఓ బాలుడి (7) మరో బాలుడు (14) లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రక్తస్రావం కావడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..