*👉మూడురోజుల పాటు కోస్తాలో వర్షాలు*
👉 : ఒడిశా, దాని పరిసరాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
👉మరోవైపు సెప్టెంబరు రెండో తేదీకి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం అభివృద్ధి చెందుతుందని ఐఎండి పేర్కొంది.
👉వీటి ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
👉 రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. ఇటీవల చైనా సముద్రంలో మూడు తుపాన్లు ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు అటువైపునకు వెళ్లిపోయాయని, దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా పెద్దగా ప్రభావం చూపలేదని వాతావరణ శాస్త్రజ్ఞులు రాళ్లపల్లి మురళీకృష్ణ వివరించారు.
👉ప్రస్తుతం నైరుతి పవనాలు మలేసియాపై ఉన్నాయన్నారు. అవి వెనక్కు వస్తేనే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
👉రెండో తేదీన ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే బీహార్, బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఎపిలో మోస్తరు జల్లులకే పరిమితమవుతాయని పేర్కొన్నారు.
Comments
Post a Comment