వన మహోత్సవాన్ని ప్రారంభించిన సిఎం జగన్
గుంటూరు :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో శనివారం ప్రారంభించారు.
విద్యార్థులతో కలిసి సిఎం జగన్ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు.
వన మహోత్సవాల్లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శనివారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
Comments
Post a Comment