కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన

మంచిర్యాల జిల్లా:-

కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోట సమ్మయ్య, సైదల పెద్ద లింగయ్యలు పొలంలో మందు చల్లడానికి వెళ్లారు. వర్షం పడటంతో చెట్టుకింద నిల్చున్నారు. వారు నిల్చున్న చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు ఇద్దరికి రైతు బీమా వర్తిస్తుందని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..