రైల్వేస్టేషనులో అరుదైన ఎగిరే పాము లభ్యం.
భువనేశ్వర్ :-
అరుదైన ఎగిరే పామును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ రైల్వేస్టేషనులో వెలుగుచూసింది. ఓ యువకుడు భువనేశ్వర్ రైల్వేస్టేషనులో ఎగిరే అరుదైన పామును బుట్టలో పెట్టి ప్రజలకు చూపించి డబ్బు వసూలు చేస్తున్నాడు. ఎగురుతూ పోతున్న ఈ అరుదైన పామును చూసిన అటవీశాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి పరిరక్షణ చట్టం ప్రకారం పాములను పట్టుకొని ఆడించడం నేరమని, దీనిపై కేసు నమోదు చేసి అరుదైన పామును అడవిలో వదిలివేస్తామని భువనేశ్వర్ అటవీశాఖ అధికారులు చెప్పారు...
Comments
Post a Comment