బైక్ ను ఢీ కొన్న ఆర్.టి.సి బస్సు ఒకరు మృతి
కృష్ణా జిల్లా :
మచిలీపట్నం, వలందపాలెం వద్ద ప్రధాన రహదారిపై బైకును ఢీకొన్న నరసాపురం డిపో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సు. బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి.
మృతి చెందిన వ్యక్తి పైడేశ్వరరావు వలందపాలెం సమీపంలోని మాచవరం మెట్టు వద్ద నివాసం ఉంటున్నారు.
పాల ప్యాకెట్లు, టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment