అమీర్‌పేట హోటల్‌లో వ్యభిచారం.

హైదరాబాద్:-

పోలీసుల దాడి. మేనేజర్‌సహా నలుగురి అరెస్టు

అమీర్‌పేట:

గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. మేనేజర్‌ సహా నలుగురిని అరెస్టు చేశారు. డీఐ వై. అజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట ధరమ్‌కరమ్‌ రోడ్డులోగల ఓయో టౌన్‌ విల్లా హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు నాని అలియాస్‌ జోగేశ్వర్‌, హోటల్‌ మేనేజర్‌ ప్రేమ్‌తోపాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు అరవన్‌ పారిపోయాడు. అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..