బేతుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ఖమ్మం:
జిల్లాలోని సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సత్తుపల్లిలో ఆదివాసీ వేడుకలకు ట్రాక్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగింది. బాధితులను నాయకులు సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరామర్శించారు.
Comments
Post a Comment