తెలంగాణ ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్..!
తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ రాబోతుందా..? అన్న ప్రశ్నపై విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. స్టాఫ్ను తగ్గించడం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వ ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఇప్పటి వరకు ఆర్టీసీలో 50వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. 50 శాతం ప్రయివేట్ రూట్లు, ప్రయివేటు బస్సులను తీసుకొస్తే ఇక ఆర్టీసీలో మిగిలేది ఐదువేల బస్సులు మాత్రమే. ఇప్పటి వరకు 10,400 బస్సులకు ఈ 50 వేల మంది కార్మికులు పనిచేసేవారు.బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో 20 నుంచి 25 వేల మంది కార్మికులు సరిపోతారు. దీంతో ఆర్టీసీలో వీఆర్ఎస్ స్కీమ్ తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. దీనిపై కొంత కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.అయితే, ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటించకపోవచ్చన్నది మరికొందరు అధికారులు చెబుతున్న మాట. సమ్మె ముగిసిన తరువాత 50 వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. ఆ తరువాత వీఆర్ఎస్ను తెరపైకి తేవాలని ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు కొంత ప్రోత్స