కండరాల ఉపశమనానికి సంబంధించిన ఇంజక్షన్‌ మోతాదుకు మించి తీసుకొని ఓ నర్సు ఆత్మహత్య

హైదరాబాదు:

కండరాల ఉపశమనానికి సంబంధించిన ఇంజక్షన్‌ మోతాదుకు మించి తీసుకొని ఓ నర్సు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నాచారం పోలీసుస్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ మహేష్‌, స్థానికుల కథనం ప్రకారం.. నాచారం అన్నపూర్ణకాలనీ కమల మెమోరియల్‌ పాఠశాల సమీపంలో ఉంటున్న రాజాప్ప కుమార్తె రోజ(25) ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రాజాప్పకు పక్షవాతం ఉండడంతో ఇంట్లోనే ఉండగా భార్య పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఉదయం విధులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రోజ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కండరాల ఉపశమానికి సంబంధించిన మత్తు ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియచేయడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..