ఈరోజు నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
శ్రీకాకుళం
గురువారం నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు పూర్తిచేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్టా జిల్లాతో పాటు యానాం ప్రాంతానికి చెందిన అభ్యర్థులు నియామక ప్రక్రియకు హాజరుకానున్నారు.
ఇందుకోసం శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంతో పాటు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లు చేశారు.
ఈసారి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానించగా 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులందరికీ అధికారులు కాల్లెటర్లు పంపించారు.
Comments
Post a Comment