సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!

అమ్మాయి ఫోనులో మాట్లాడితే... కరిగిపోయి నగదు బ్యాంకు అకౌంట్లలో వేసేస్తారా..? పాలకుల పేర్లు చెప్పి మీకు ఎన్నికల్లో సీట్లు ఇస్తామంటే... ఏమీ ఆలోచించకుండా మోసపోయే వారు ఉన్నారా...? అవతలి వారు అమ్మాయి అయితే చాలు డేటింగ్ చేసేద్దామంటే... ముగ్గులోకి దిగిపోయేవారు ఉంటారా..? ఇవన్ని జరుగుతున్నాయంటే.. నమ్మట్లేదు కదా. నిజంగా నిజమండి... ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఆశపడే వాళ్లకు హద్దులు లేకపోతే.. దోచుకునే వారికి దారులెన్నో..!

సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!

అమెరికా అమ్మాయికి... ఆంధ్రా పెద్దాయనకు మధ్య ఫ్రెండ్ షిప్.! ఆమె రెండుపదుల వయసు దాటిన యువతి. ఈయన ఆరు పదుల వయసు దాటిన విశ్రాంత ఉద్యోగి. ఫేస్​బుక్ వారి పరిచయానికి వేదికైంది. చివరకు ఆ పెద్దాయన అక్షరాల రూ.34 లక్షలు పొగొట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి అనేక సైబర్ నేరాలు మన విశాఖ పరిధిలోనే ఎక్కువ జరిగాయంటే అతిశయోక్తి కాదు.

చిన్న మెసేజ్... పెద్ద ముప్పు..!
ఎదో మాయలో పోర్న్ సైట్లు, డేటింగ్ సైట్లపై ఒక్క క్లిక్ చేశారా... అంతే... చేదు అనుభవానికి మీరు తలుపు తెరిచినట్టే. ఆ తరువాత ఏ ఇతర వెబ్​సైట్​ వెతికినా.. మన ప్రమేయం లేకుండానే... అశ్లీల సైట్లు మనకు హాయ్ చెబుతాయి. నిను వీడని నీడను నేనే అంటూ... డేటింగ్ టూ ఛాటింగ్​ మత్తులోకి దింపేస్తాయి. మీ పర్స్ ఖాళీ చేస్తాయి.
ఫోన్ ఉంది కదా..! మీరు డబ్బులు గెల్చుకున్నట్టు సందేశ వస్తే నమ్మి... ఆహా ఇల్లు తీసుకోవాలి... కాదు కాదు.. టూర్ వెళ్లాలి అని ఫిక్సవుతున్నారా..! ఒక నిమిషం ఆలోచించండి. ఏళ్లపాటు కష్టపడితేనే.. కోటీశ్వరులు కావడం కష్టం. అలాంటింది ఒక మెసేజ్​ను నమ్మి.. పరుగులు పెట్టాల్సిన అవసరం ఏముంది. బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు సంఖ్య, దాని వెనక ఉండే సీవీవీ నెంబరు... ఇలా మనం దాచుకుంది... దోచుకోవడానికి అవసరమైన సమాచారం సైబర్ దొంగకు చెప్పిస్తుంది ఆ చిన్న మెసేజ్.
అవగాహన అవసరమే..!
ఇలా చెప్పుకుంటూ పోతే... ఒకటా రెండా.. సైబర్ ఉచ్చులో పడేందుకు వందల దారులున్నాయి. విశాఖ నగరంలో వరుసగా వెలుగులోకి వస్తున్న సైబర్ మోసాలు.. మన చుట్టూ ఉన్న ముప్పును హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలపై కన్నువేస్తున్నారు మోసగాళ్లు. విశాఖ సైబర్ క్రైం పోలీస్​స్టేషన్​లో నమోదవుతున్న కేసుల్లో కీలకమైనవి... ఇతర రాష్ట్రాల నుంచి వలపన్ని మోసం చేస్తున్నవే.
ఓఎల్ఎక్స్ సమాచారంతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్​ను బెంగళూరులో అరెస్టు చేయడం... జాబ్ ఫ్రాడ్ కేసులో దిల్లీలో ముగ్గురిని అరెస్టు చేయడం, కోల్​కతాలో విశాఖ పోలీసులు హనీ ట్రాప్ రాకెట్​​ను చేధించడం... ఇలా సైబర్ నేరాలు రోజుకో రూపాన్ని మార్చుకుంటున్నాయి. అందుకే పోలీసులు తస్మాత్​ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.
కోటీశ్వరుల్ని చేస్తాం... అమ్మాయిలతో పరిచయాలు చేస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్... ఈ మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివిధ రాష్ట్రాలకు వెళ్లి పోలీసులు సమర్థంగా సైబర్ కేసుల్ని ఛేదిస్తున్నా... అసలు అవి జరగడానికి గల మూల కారణాలు ఏంటో ప్రజలకు తెలియాలి కదా..! అంతర్జాల ప్రియులరా... చరవాణితో జర జాగ్రత్త.

Comments

  1. నేను అలాగే మోసపోయిన నాకు ఓక్కవ్యక్తి ఫోన్ చేసి మీకు గిఫ్ట్ వచ్చింది అని నా దగ్గర నుండి 9000 డబ్బులు వేయంచుకునాడు తిరిగి వస్తాయా నాకు కోంచం సలహ ఇవ్వండి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..