భారత్ పై బంగ్లాదేశం విజయం ...
భారత్ పై బంగ్లాదేశం విజయం ...
ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ల మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
అనంతరం 149 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మూడు బాల్స్ మిగిలి ఉండగానే 19.3 ఓవర్లలో 154 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని చేరింది.
బంగ్లా బ్యాట్స్మెన్లలో లిటన్ దాస్-7, మొహమ్మద్ నయీం-26, సర్కార్-39 పరుగులు చేసి ఔటవ్వగా ముస్తఫిజుర్ రహీం- 60, మహ్మదుల్లా-15 పరుగులతో నాటౌట్గా నిలిచారు. భారత్ బౌలర్లలో డీఎల్ చాహర్, అహ్మద్, చావల్కు తలో వికెట్ పడింది.
మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్ కొనసాగుతుంది.
Comments
Post a Comment