కర్తార్పుర్ ఆధ్యాత్మిక నడవా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేసింది పాకిస్థాన్
కర్తార్పుర్ ఆధ్యాత్మిక నడవా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేసింది పాకిస్థాన్.
అయితే ముగ్గురు ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలకు ఈ వీడియోలో స్థానం కల్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఖలిస్థానీ వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ బింద్రేన్వాలేకు కర్తార్పుర్ నడవా ప్రారంభోత్సవ వీడియోలో స్థానం కల్పించడంపై దౌత్య మార్గాల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
కర్తార్పుర్ నడవా నిర్మాణంపై చర్చల సమయంలోనూ.. పాక్ తరఫు నుంచి ఖలిస్థానీ వేర్పాటువాద నేతకు స్థానం కల్పించడంపై తీవ్రంగా ఆక్షేపించింది భారత్.
Comments
Post a Comment