బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్బుల్’ తుఫాన్ శుక్రవారం అతి తీవ్ర తుఫాన్గా మారింది
విశాఖపట్నం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్బుల్’ తుఫాన్ శుక్రవారం అతి తీవ్ర తుఫాన్గా మారింది.
పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు, బంగ్లాదేశ్కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
శనివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సాగర్ దీవులు, బంగ్లాదేశ్ ఇది మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఈ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
ఒడిసా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని, ఏపీపై ప్రభావం ఉండదని తెలిపింది.
Comments
Post a Comment