అత్తారింట్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించగా ఐదుగురి పరిస్థితి విషమం
అత్తారింట్లో ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ నేపథ్యంలో ఓ భర్త తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఇద్దరు బావమరుదులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment