అమ్మఒడిపథకంలో కీలక మార్పులు

అమరావతి

ప్రభుత్వం అమ్మఒడిపథకంలో కీలక మార్పులు చేసింది. అమ్మఒడి కింద పిల్లలతో సంబంధం లేకుండా తల్లి, గార్డియన్ కేంద్రంగా రూ.15వేలు చెల్లించనున్నారు.

ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాల అమలుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మార్గదర్శకాలు

⦁ విద్యార్థులకు 75% హాజరు ఉండాలి.

⦁ స్వచ్ఛంద సంస్థల్లో చదివే అనాథలు, వీధిబాలలకు సంబంధించి ఆయా శాఖలతో సంప్రదించి చెల్లిస్తారు.

⦁ విద్యాసంవత్సరం మధ్యలో చదువు మానేసిన పిల్లలు అనర్హులు.

⦁ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, పింఛన్​దారులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.

⦁ విద్యార్థి తల్లి బ్యాంకు, తపాల ఖాతాకు ప్రతి ఏడాది జనవరిలో రూ.15 వేలు ఆన్​లైన్ లో చెల్లిస్తారు.

⦁ దీనికోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక వెబ్​సైట్ ని రూపొందిస్తోంది.

⦁ విద్యార్థి తల్లి వివరాలను విద్యాసంస్థలు సేకరిస్తాయి. వీటిని డేటా, పౌరసరఫరాల శాఖ , ఇతర విభాగాలతో సరిపోల్చి చూస్తారు.

⦁ రేషన్ కార్డు లేనివారికీ ఈ పథకం వర్తించనుంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది