అయోధ్య తీర్పు ఈరోజు వెలువడనున్న నేపధ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది

న్యూఢిల్లీ: 

అయోధ్య తీర్పు ఈరోజు వెలువడనున్న నేపధ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. 

రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచారు. 

ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు. 

ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే యూపీలోని మురాదాబాద్ రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. 

అనుమానితులపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తున్నారు. 

అత్యంత సున్నిత ప్రాంతాలుగా పరిగణించే గజియాబాద్, సహరన్‌పూర్ రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో వదంతులు సృష్టించేవారిపై నిఘాపెట్టారు. 

ప్రయాణికులు ఇటువంటి వదంతులు విన్నవెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..