తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధించిన గడువు సమీపిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధించిన గడువు సమీపిస్తోంది.
కౌంట్ డౌన్ మొదలైంది. ఈ అర్ధ్రరాత్రి వరకే వారికి ఉన్న సమయం. కొన్ని చోట్ల స్వల్ప సంఖ్యలో కార్మికులు తిరిగి విధులో చేరుతున్నా రు. కార్మిక సంఘాలు మాత్రం ఈ డెడ్ లైన్లను పట్టించుకోమంటున్నారు. ఇప్పటికే అయిదు వేల ప్రయివేటు బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం..కార్మికులు నిర్ణీత సమయంలో లోగా విధుల్లో చేరకుంటే మిగిలిన సర్వీసులను ప్రయివేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
ఆ తరువాత ఆర్టీసీ ఉండదని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఇదే సమయంలో విధుల్లో చేరే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, రాజకీయ పార్టీలతో జేఏసీ నేతలు సమావేశమవుతున్నారు. కోర్టుల ద్వారానూ మీ సమస్యకు పరిష్కారం లభించదంటూ ప్రభుత్వం న్యాయ పరంగా జరిగే ప్రక్రియను సైతం వివరించింది. దీంతో. సమయం గడస్తున్న కొద్దీ. అటు ప్రభుత్వం. ఇటు జేఏసీ నేతలు. మధ్యలో కార్మికులు ఏం జరుగుతోంది. అర్దరాత్రి లోగా ఏం జరగనుండి. గడువు ముగుస్తే ప్రభుత్వం ఏం చేయనుంది...
Comments
Post a Comment