నేడే 'మహా' ప్రతిష్టంభనకు తెర..!

రాష్ట్రపతి పాలనలో ఉన్న మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై ముఖ్య ప్రకటన చేయనున్నారు. దీనితో ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన మహా ప్రతిష్టంభనకు నేటితో తెరపడే అవకాశముంది.

కీలక సమావేశాలతో మహారాష్ట్ర రాజకీయాలు నేడు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. ఈ సమావేశాల తర్వాత మహా ప్రతిష్టంభనకు తెరదించితూ.. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మూడు భేటీలు...
నేడు ముంబయిలో మిత్రపక్షాలతో భేటీకానున్నారు కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు. అనంతరం శివసేనతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత పృథ్వీరాజ్​ చౌహాన్​ ప్రకటించారు. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉన్న అన్ని అంశాలపైనా కాంగ్రెస్​-ఎన్​సీపీ నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కనీస ఉమ్మడి ప్రణాళిక, కూటమి ఏర్పాటు, అధికార భాగస్వామ్యం తదితర విషయాలను శివసేనతో చర్చించనున్నట్టు స్పష్టం చేశారు.
ఎన్​సీపీ-కాంగ్రెస్​తో భేటీకీ ముందు.. శివసేన ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. సేన భవిష్యత్​ కార్యాచరణపై కీలక ప్రసంగం చేయనున్నారు ఠాక్రే.
పవార్​తో ఠాక్రే భేటీ...
దిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​తో ఉద్ధవ్​ ఠాక్రే.. గురువారం రాత్రి భేటీ అయ్యారు. ఇందులో ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్​ రౌత్​ పాల్గొన్నారు. శివసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు, సంకీర్ణ ప్రభుత్వంలో పదవుల పంపకాలపై ఈ భేటీలో అగ్రనేతలు చర్చించినట్టు సమాచారం.
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్టోబర్​ 24న విడుదలయ్యాయి. భాజపా-105, శివసేన- 56 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​- 44, ఎన్​సీపీ- 54 సీట్లు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు తలెత్తడం వల్ల మిత్రపక్షం భాజపాతో తెగదెంపులు చేసుకుంది శివసేన.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..