జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి లేని భవన నిర్మాణ కార్మికులకు అండగా డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి లేని భవన నిర్మాణ కార్మికులకు అండగా  డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు 

గుంటూరు జిల్లా మంగళగిరి : ఆహార శిబిరంలో భవన నిర్మాణ కార్మికులకు స్వయంగా భోజనం వడ్డించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ కామెంట్స్ ...

వైయస్సార్సీపి  గవర్నమెంట్ కార్మికులకు ఉపాధి చూపడంలో విఫలమైంది ,ఐదేళ్ల పాలనలో 50 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.


ఆత్మహత్య చేసుకున్న ప్రతి భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం 5లక్షల పరిహారం చెల్లించాలి, అలాగే ఈ ఐదు నెలల పాటు ఉపాదికోల్పయిన కార్మికులకు నెలకి పదివేలు చొప్పున 50 వేల రూపాయలు ప్రభుత్వం ప్రతి కార్మికుడికిచెల్లించాలని డిమాండ్.

రాజధాని విషయంలో జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన వైఖరి తెలియజేయాలి, అమరావతిలో నిర్మిస్తారో లేక పులివెందుల లో నిర్మిస్తారో చెప్పాలి ,రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ సహకరిస్తుంది.


జనసేన పార్టీ ఎప్పుడు సామాన్యులకు అండగా ఉంటుంది దానికి నిదర్శనమే నేడు 150 నియోజకవర్గాల్లో ఉపాధి లేని భవన నిర్మాణ కార్మికుల కోసం ఆహార శిబిరాలు ఏర్పాటు

నేను ఎప్పుడు వ్యక్తిగత దూషణకు పాల్పడలేదు, కానీ సామాన్యుడి కడుపు మండితే నా గొంతు రూపంలో బయటకు వస్తుందని గుర్తుంచుకోవాలి.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..