బాబ్రీ మసీదు స్థలంలో గతంలో రామ మందిరం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారన్నది హిందువుల వాదన.

బాబ్రీ మసీదు స్థలంలో గతంలో రామ మందిరం ఉండేదని, దాన్ని కూల్చి మసీదు నిర్మించారన్నది హిందువుల వాదన. 

అలాంటిదేమీ లేదని ముస్లిం పక్షాలు వాదిస్తున్నాయి. 

దీంతో ఆ స్థల వివాదంపై దాఖలైన నాలుగు సివిల్​ దావాలపై అలహాబాద్​ హైకోర్టు 2010 సెప్టెంబర్​ 30న కీలక తీర్పు వెలువరించింది. 

వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలని స్పష్టం చేసింది.

అలహాబాద్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో 14 పిటిషన్లు దాఖలు కాగా 2011 మేలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. 

తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

తొలుత మధ్యవర్తిత్వానికి అవకాశమిచ్చినా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబర్​ 16 వరకూ రోజువారీ విచారణ చేపట్టింది. తుది తీర్పును రిజర్వ్​ చేసింది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..