మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన

మహారాష్ట్ర

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన మధ్య గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారీని నేడు భాజపా ప్రతినిధుల బృందం కలవనుంది. 

ఈ బృందానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ నేతృత్వం వహించనున్నారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో నేడు సమావేశం కానున్నారు శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.

మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్​ 9తో ముగియనున్న వేళ.. రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భాజపా-శివసేన మధ్య నెలకొన్న విభేదాలు కొలిక్కి రాక ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ప్రభుత్వ ఏర్పాటుపై రెండు రోజుల్లో అధికార కూటమి పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 9లోపే నూతన ప్రభుత్వ కొలువుదీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశాయి. భాగస్వామ్య పార్టీ శివసేనతో సంప్రదింపులు పూర్తయినట్లేనని పేర్కొన్నాయి.

గవర్నర్​తో భేటీ..

ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారీని నేడు కలవనుంది భాజపా ప్రతినిధుల బృందం. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ వీరికి నేతృత్వం వహించనున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ఆమోదం తెలిపిన సందేశాన్ని గవర్నర్​కు చేరవేయనున్నట్లు తెలిపారు భాజపా నేత, రాష్ట్ర మంత్రి ముంగంటివార్​. గవర్నర్​తో భేటీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

పార్టీ నేతలో ఠాక్రే సమావేశం..

శివసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే నేడు ఉదయం 11:30 గంటలకు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పట్టు వీడని సేన..

ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లేనని అధికార భాజపా తెలిపినప్పటికీ.. శివసేన తన పట్టు వీడినట్లు కనిపించటం లేదు. భాజపా నుంచి తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని సేన నేత సంజయ్​ రౌత్​ స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే వద్దకు ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..