ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం...18 ఏళ్లు రాగానే విత్‌డ్రా!

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల్లో ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో బాలిక సమృద్ధి యోజన కూడా ఒకటి. ఈ పథకం చిన్నారుల కోసం అందుబాటులో ఉంది. ఇందులో చేరడం వల్ల ఆడపిల్లలకు ప్రయోజనం కలుగుతుంది. *Balika Samriddhi Yojana - బాలిక యోజన పథకం 1997 నుంచి అమలులో ఉంది. స్కూళ్లలో ఆడ పిల్లల సంఖ్యను పెంచడానికి ఈ స్కీమ్‌ను తీసుకువచ్చారు. ఈ పథకం కింద ఆడ పిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 క్యాష్ గిఫ్ట్‌గా ఇస్తారు. తర్వాత ఆడ పిల్ల స్కూల్‌కు వెళ్లిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తారు. 18 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. గ్రామాల్లో అంగన్‌వాడీ వర్కర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్‌ అప్లికేషన్ ఫిల్ చేసి పథకంలో చేరొచ్చు.

పట్టణాల్లో అయితే హెల్త్ ఫంక్షనరీస్ వద్ద స్కీమ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300 అందజేస్తారు. తర్వాత 4వ తరగతి నుంచి రూ.500 వస్తాయి. 5వ తరగతికి రూ.600, 6 నుంచి 7వ తరగతికి రూ.700, 8వ తరగతికి రూ.800, 9వ తరగతిలో రూ.1000 స్కాలర్ అందజేస్తారు.

ఇకపోతే ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ మాత్రమే కాకుండా మరో పథకం కూడా అందుబాటులో ఉంది. అది సుకన్య పథకం. *Sukanya Samriddhi Yojana - కేంద్ర ప్రభుత్వం 2015లో సుకన్య పథకాన్ని ఆవిష్కరించింది. దీంతో గ్యారంటీ రిటర్న్స్ పొందొచ్చు.

ఇక ఇంట్లో గరిష్టంగా ముగ్గురి పేరుపై సుకన్య అకౌంట్‌ను తెరవొచ్చు. సాధారణంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే సుకన్య అకౌంట్ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే ఒకేసారి కవలల పుడితే అప్పుడు గరిష్టంగా ముగ్గురి పేరుపై అకౌంట్ తెరవొచ్చు. కనీసం రూ.250 నుంచి డిపాజిట్ చేయవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశముంది. 7.9 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. పదేళ్లలోపు వయసు ఉన్న ఆడ పిల్లల పేరుపై సుకన్య ఖాతాను తెరవొచ్చు. సుకన్య అకౌంట్‌పై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అమ్మాయికి 18 ఏళ్ల వచ్చిన తర్వాత అకౌంట్‌లోని డబ్బులో 50 శాతం వెనక్కు తీసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత మొత్తం డబ్బు తీసుకోవచ్చు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..