పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి.
కొండమల్లేపల్లి: పాఠశాల బస్సు కిందపడి విద్యార్థి మృతి.
నల్గొండ జిల్లా:- కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఇస్లావత్ రాకేశ్ (07). అనే బాలుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
Comments
Post a Comment