సీబీఐకి కనిపించని చిదంబరం
సీబీఐకి కనిపించని చిదంబరం... లుక్ అవుట్ నోటీసులు జారీ....అరెస్ట్పై ఉహాగానాలు
ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం అదృశ్యం అయ్యారు.
ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును సైతం ఆశ్రయించారు.
అయితే అంతకు ముందే సిబిఐ తోపాటు ఈడీ అధికారులు ఆయన చేరుకోవడంతో వారికి చుక్కెదురైంది.
చిదంబరం ఇంట్లో లేకపోవడం వారు వెనుదిరిగారు. దీంతో ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ ఉన్నట్టు సమాచారం. ఇక ఆయన ఆచూకి కోసం దర్యాప్తు సంస్థలు వెతుకున్నాయి.
మంగళవారం అర్థరాత్రిలోగా కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశాయి. అయితే చిదంబరం నుండి ఎలాంటీ సమాచారం లేదు.
కాగా ఆయన బెయిల్ కోసం వేసిన పిటిషన్ బుధవారం సుప్రిం కోర్టు విచారించనుంది.
Comments
Post a Comment