మైసూరులో ‘యువ దసరా స్పోర్ట్స్‌ ఈవెంట్‌’

మైసూరు:

కర్ణాటకలోని మైసూరులో ‘యువ దసరా స్పోర్ట్స్‌ ఈవెంట్‌’ అట్టహాసంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బీ ఎస్‌ యడియూరప్ప, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షట్లర్‌ సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సింధును ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సింధును స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని యువ క్రీడాకారులకు సూచించారు.

సింధు ప్రపంచం మెచ్చిన క్రీడాకారిణి అని తెలిపిన సీఎం, భారతదేశానికి దొరికిన ఆణిముత్యం సింధు అని కొనియాడారు.

కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..