13 రామచిలుకలను అదుపులోకి తీసుకొని దిల్లీ కోర్టులో హాజరుపరిచారు సీఐఎస్ఎఫ్ అధికారులు.
ఢిల్లీ
13 రామచిలుకలను అదుపులోకి తీసుకొని దిల్లీ కోర్టులో హాజరుపరిచారు సీఐఎస్ఎఫ్ అధికారులు.
చిలుకలను కోర్టులో ప్రవేశపెట్టడమేంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే? కాకపోతే అవి ఏ తప్పూ చేయలేదు. అక్రమంగా ఆ చిలుకలను విదేశానికి తరలిస్తూ ఓ ఉజ్బెకిస్థాన్ జాతీయుడు పట్టుబడ్డాడు. అతనితో పాటు ఆ చిలుకలను అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకొచ్చారు అధికారులు. ఈ సంఘటన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
దిల్లీ కోర్టులో 13 రామచిలుకలను ప్రవేశపెట్టారు అధికారులు. చిలుకలను కోర్టుకు తీసుకురావడమేంటని అనుకుంటున్నారా.. అయితే చిలుకలు తప్పేం చేయలేదు. వాటిని అక్రమంగా వేరే దేశానికి తరలిస్తున్న వ్యక్తితో పాటుగా కోర్టుకు తీసుకొచ్చారు సీఐఎస్ఎఫ్ అధికారులు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చెప్పులు ఉంచే అట్టపెట్టెల్లో చిలుకలను ఉంచి... అధికారుల కళ్లుకప్పి గుట్టుగా తమ దేశానికి తీసుకుపోదాం అనుకున్నాడో వ్యక్తి . అతని ప్రయత్నం బోల్తాకొట్టి భద్రతాధికారుల తనిఖీల్లో దొరికిపోయాడు. నిందితుడిను అదుపులోకి తీసుకుని, చిలుకలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు 'చిలుకలను ఓ దుకాణంలో కొనుగోలు చేశానని, ఉజ్బెకిస్థాన్లో చిలుకలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల వాటిని అక్రమంగా తరలిస్తున్నట్లు' వెల్లడించాడు.
నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. అక్టోబర్ 30 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చిలుకలను ఓక్లా పక్షుల సంరక్షణ కేంద్రంలో ఉంచాలని అధికారులను ఆదేశించింది కోర్టు.
Comments
Post a Comment