జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం ..
నెల్లూరు జిల్లా : సూళ్లూరుపేట
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది.
శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వాహకనౌక ద్వారా జీశాట్ 30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు.
దీని బరువు 3357 కిలోలు.
ఇది కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇన్శాట్- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
భారత్కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.
Comments
Post a Comment