దేశంలో మరో ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది
గుజరాత్
దేశంలో మరో ప్రైవేటు రైలు పట్టాలెక్కనుంది. లఖ్నవూ-దిల్లీ మధ్య ప్రస్తుతం నడుస్తున్న తేజస్ ప్రైవేట్ ఎక్స్ప్రెస్ విజయవంతమైన క్రమంలో అహ్మదాబాద్-ముంబయి మార్గంలో మరో తేజస్ను నేడు ప్రారంభించనుంది ఐఆర్సీటీసీ.
జనవరి 19 నుంచి రాకపోకలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.
ఈ రైలును రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలు ఇవాళ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.
వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.
వారానికి ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది.
అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి ఏసీ ట్రైన్గా తేజస్ ముందుకొచ్చింది.
ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్థ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్కార్స్తో పాటు 8 చైర్ కార్స్తో మొత్తం 736 మంది ప్రయాణికులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు.
ట్రైన్ బుకింగ్ సేవలను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
ఐఆర్సీటీసీ వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్ రైల్కనెక్ట్ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను నమోదు చేసుకోవచ్చు.
Comments
Post a Comment