ముఖేష్ సింగ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి ముఖేష్సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు.
ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష అర్జీని నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ హోంశాఖకు పంపిచారు.
హోంశాఖ వెంటనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపింది. తాజాగా రాష్ట్రపతి ముఖేష్సింగ్ దరఖాస్తును తిరస్కరించారు.
ముఖేష్ సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒక వేళ రాష్ట్రపతి తిరస్కరించినా దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈ నెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
దీంతో నిందితులు కావాలనే తమ ఉరిని వాయిదా వేసేందుకు క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్ల పేరుతో నాటకాలాడుతున్నారని నిర్భయ తల్లిదండ్రులు, పలువురు అధికారులు, సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ముఖేశ్ క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు.
Comments
Post a Comment