యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలు
హైదరాబాద్
నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల కలిగే నష్టాలపై చర్చించేందుకు సోమవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకనటలో తెలిపింది.
ఇక్కడి దస్పల్లా హోటల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే సమావేశానికి జనసేన అధినేత పవన్కల్యాణ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రేవంత్రెడ్డి, వి.హన్మంతరావు, అసదుద్దీన్ ఒవైసీ, రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కోదండరాం, చెరుకు సుధాకర్, తదితరులు హాజరవుతారని పేర్కొంది.
సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్, వీహెచ్ ఆదివారం పరిశీలించారు.
Comments
Post a Comment