జియో గిగాఫైబర్​ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

ముంబై

జియో గిగాఫైబర్​ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ కనెక్షన్​లు ఒకే ప్యాకేజీగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

కాంప్లిమెంటరీగా సెట్​టాప్​ బాక్స్​ను ఉచితంగా అందివ్వనున్నట్లు సమాచారం.

జియో గిగా ఫైబర్​ ప్రత్యేకతలు

జియో గిగా ఫైబర్​ సేవల్లో... వివిధ ప్లాన్లు రూ.700 - రూ.10,000 మధ్య లభిస్తాయి.

100 ఎంబీపీఎస్ నుంచి గరిష్ఠంగా​ 1 జీబీపీఎస్​ స్పీడ్​ వరకు ఇంటర్నెట్​ ప్లానులు ఉన్నాయి.

వార్షిక ప్లాన్​ తీసుకున్నవారికి హెచ్​డీ టీవీ సెట్​ ఉచితంగా అందిస్తారు.

ల్యాండ్​లైన్​ ఫోన్​, జియో 4కే సెట్​టాప్​ బాక్స్​ ఉచితంగా ఇస్తారు.

జియో ఫైబర్​తో అల్ట్రా హై డెఫినిషన్​ ఎంటర్​టైన్​మెంట్​, హోమ్​ సెక్యూరిటీ, స్మార్ట్​ హోమ్ సొల్యూషన్స్​ వంటి సేవలు పొందవచ్చు.

చలనచిత్రాలు, ఇతర వీడియో కంటెంట్​ మొబైల్​ యాప్స్​ ఉచితంగా లభిస్తాయి.

మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్​, ఎస్​టీబీ వీడియో కాలింగ్​ సౌకర్యాలు ఇందులో లభిస్తాయి. అయితే ఇందు కోసం వినియోగదారులు తమ టీవీ సెట్​లకు కెమెరాను అనుసంధానించుకోవాలి.

ల్యాండ్​లైన్​ నుంచి దేశంలో ఎక్కడికైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.

Comments

Post a Comment

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..