జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు

అమరావతి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి జగన్​ ఇవాళ స్వయంగా వీక్షించనున్నారు.

ప్రమాద స్థలికి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకోనున్న సీఎం జగన్... ఆ ప్రాంతాన్ని విహంగ వీక్షణం ద్వారా పరిశీలిస్తారు.

ఆ తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయం వద్ద అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడనున్నారు.

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రకటించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..