రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది

అమరావతి

ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల శివప్రసాదరావు చనిపోయారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ...రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. నేడు, రేపు సంతాప దినాలుగా పాటించనుంది.

అన్ని నియోజకవర్గాల్లో నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

కోడెల సంతాప సభలు ఏర్పాటు చేయడంతోపాటు...పార్టీ కార్యాలయలపై జెండాలను అవతనం చేయాలని సూచించారు.

కోడెల ఆత్మహత్య చేసుకోవాడానికి దారితీసిన పరిస్థితులు...ప్రభుత్వం వేధింపుల గురించి ప్రజలకు వివరించాలన్నారు.

రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వైకాపా కుట్రలపై ఐక్యంగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..