గణేశ్ ఉత్సవాల్లో మద్యం కిక్కుపై పోలీసులు కన్నెర్ర చేశారు.
సూరత్ (గుజరాత్) :
గణేశ్ ఉత్సవాల్లో మద్యం కిక్కుపై పోలీసులు కన్నెర్ర చేశారు.
గణేశ్ పూజా మండపంలో 8మంది యువకులు బీరు తాగుతూ డాన్స్ చేసిన వీడియో వైరల్ అయిన ఉదంతం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని మహిధర్పుర ప్రాంతంలో వెలుగుచూసింది.
సూరత్ నగరంలోని గోల్వాడ ప్రాంతంలోని మహీధర గణేశ్ పూజా మండపంలోనే వినాయకుడి విగ్రహం వద్ద 8 మంది యువకులు బీరు తాగుతూ బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు.
అత్యంత భక్తిప్రపత్తులతో గణనాధుడికి పూజలు చేయాల్సిన యువకులు మద్యం మత్తులో జోగుతూ పాటలు పాడుతూ డాన్స్ చేశారు.
ఈ డాన్స్ వీడియో వైరల్ కావడంతో సూరత్ పోలీసులు రంగంలోకి దిగి మద్యం తాగుతూ డాన్స్ చేసిన 8 మంది యువకులను అరెస్టు చేశారు.
ఈ ఘటన గణేశ్ ఉత్సవాల్లో సంచలనం రేపింది.
Comments
Post a Comment