విషాదం నింపుతున్న ఆదివారం

విషాదం నింపుతున్న ఆదివారం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం పలువురు పర్యాటకుల ప్రాణాలను బలిగొంది.

వారాంతపు సెలవుదినం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.

దీంతో ఆదివారం కాస్తా విషాదాదివారంగా మారింది.

ఈ ఒక్క ఘటనే కాదు.. గతంలో జరిగిన పడవ బోల్తా ఘటనలూ ఆదివారమే జరగడం గమనార్హం.

కృష్ణా, గోదావరి నదుల్లో గతంలో జరిగిన ఘటనలు చూస్తే ఈ విషయం అవగతమవుతోంది.

విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం 2017 నవంబర్‌ 12న కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన భక్తులు బోటులో ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు.

2018 జులైలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడటంతో 15 మంది మృతి చెందారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..