బెజవాడ నుంచి నడుస్తున్న సింగపూర్ విమాన సర్వీసు రద్దయ్యింది.
విజయవాడ:
రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో నడుస్తున్న ఈ సర్వీసుకు జూన్ 30తో కాంట్రాక్టు గడువు ముగుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఈ ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉండగా వైసీపీ సర్కారు సుముఖత చూపలేదు.
రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) నుంచి ఈ మేరకు ఈమెయిల్ రావటంతో.. ఇండిగో సంస్థ సింగపూర్ సర్వీసును రద్దు చేయాల్సిందిగా ఇక్కడి ప్రాంతీయ అధికారులకు సమాచారం పంపింది.
దీంతో జూలై 9 నుంచి సింగపూర్ విమాన సర్వీసును రద్దు చేశారు. ఆన్లైన్ బుకింగ్ను ఆపేశారు.
Comments
Post a Comment