ఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు
అమరావతిః
ఆంధ్రప్రదేశ్లో శనివారం నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగు తున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతా వరణశాఖ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువ లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది.
ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో శనివా రం నుంచి రెండురోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రం లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆవర్తనం 30వ తేదీ నాటికి అల్పపీడనంగా మార నుందని ఇది జూలై మొదటి వారంలో తుపానుగా మారే అవకాశం లేకపోలేదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కాగా నైరుతి రుతుపవనాల విస్తరణ అం చనాలకు భిన్నంగా నిదానంగా కొనసాగుతోంది.
వాతావరణ పరిస్థితులు నైరుతి గమనానికి అనుకూలంగా లేవని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నా రు.
మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Post a Comment