కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

న్యూఢిల్లీ

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పలువురు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాహుల్‌ గాంధీని కలవనున్నారు.

ఈ మేరకు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో రాహుల్‌తో భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని మే 25న రాహుల్‌ ప్రకటించారు.

ఆయనకు మద్దతుగా గత 4రోజుల్లో వివిధ రాష్ట్రాల నాయకులు పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..