గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌కు పోటెత్తిన వీక్ష‌కులు.. అనూహ్య స్పందన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పంచాయతీలలో ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్లను ఒక వాలంటీర్‌గా నియమిస్తామని పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే చెప్పిన విషయం విదితమే.

ప్రభుత్వ ఏర్పాటు అనంతరం గ్రామ వాలంటర్‌ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

కాగా.. ఇప్పటికే విడుదలైన ఈ నోటిఫికేషన్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది.

కేవలం ఆరు రోజుల్లో మూడు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
       
మరోవైపు వెబ్‌సైట్‌ను చూడటానికి వీక్షకులు పోటెత్తారు. ఇప్పటి వరకూ 11లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను నెటిజ‌న్లు తిల‌కించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..