ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
పూణే : ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు.
ముంబై- పూణే మార్గంలో సోమవారం ఉదయం జంబుర్గ్- థాకూర్ వాడీ రైల్వేస్టేషన్ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది.
దీంతో ముంబై నుంచి పూణేకు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.
ముంబై-పూణే నగరాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.
దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఇగత్పురి రైల్వేస్టేషను మీదుగా దారి మళ్లించారు
Comments
Post a Comment